25, అక్టోబర్ 2019, శుక్రవారం

నవ్వులను పంచడానికి వచ్చేశారు పాగల్ పంతి టీమ్

మామూలుగా మనకు సినిమాలు అనగానే  కొందరికి ప్రేమ కథలంటే ఇష్టం.మరి కొందరికి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. హారర్ సినిమాలు మనం భయపడుతూనే ఇష్టంగ చూస్తాం.కానీ కామెడీ జానర్ చిత్రాలు ప్రతి ఒక్క  ప్రేక్షకుడిని అలరింపజేస్తాయి. భాషతో సంబంధం లేకుండా కామెడీని అందరూ ఆస్వాదిస్తారు.

2007 వ సంవత్సరంలో అక్షయ్ కుమార్ హీరోగా  కత్రినా కైఫ్ జంటగా నానా పాటే కర్, అనిల్ కపూర్ కలిసి నటించిన వెల్‌కమ్ చిత్రం గొప్ప విజయం సాధించింది.2015 లో జాన్ అబ్రహాం, శృతి హాసన్, అనిల్ కపూర్, నానా పాటేకర్ నటించిన వెల్‌కమ్ బ్యాక్ చిత్రం విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలను అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం వెల్కమ్ చిత్ర బృందం తిరిగి ఈ చిత్ర సీక్వెల్  మన ముందుకు తీసుకువస్తున్నారు .కానీ చిత్ర టైటిల్ పాగల్ పంతి అని మార్చారు. ముగ్గురు కొంటె కుర్రాళ్ళు తాము ధనవంతులమని అబద్ధం చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళను ఎలా ఆట పట్టించారో  అనేది చిత్ర కథ.చాలా మలుపులతో చాలా మంది నటీ నటులతో గమ్మత్తుగా ఉండబోతోంది ఈ సినిమా.

ఈ చిత్రంలో జాన్ అబ్రహం, ఇలియానా, అనిల్ కపూర్, అర్షద్ వార్సి, పులకిత్  సామ్రాట్, ఊర్వశి, క్రితి  కర్బందా ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ చిత్రం T-సిరీస్ భూషన్ కుమార్ నిర్మించగా అనీష్ బాజ్మీ  దర్శకత్వం వహించారు.సాజిద్ - వాజిద్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది.కామెడిని ఆస్వాదించాలంటే ఈ చిత్రం తప్పక చూడాల్సిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...