27, ఏప్రిల్ 2019, శనివారం

భారత్ చిత్ర ట్రైలర్

నమస్కారం మిత్రులారా,
   ఇటీవల విడుదలైన హిందీ పరిశ్రమ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన  " భారత్" చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.దీనిలో గల ముఖ్య విశేషాలు చూస్తే ........

           మొదటి సారిగా సల్మాన్ ఖాన్ ఇందులో మూడు వైవిధ్య పాత్రల్లో అనగా స్టంట్ మేన్ గా‌‌,ముసలివాడిగా,నేవీ అధికారిగా నటించారు.
             ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫీలింస్ బ్యానర్ పై అతుల్ అగ్నిహోత్రి నిర్మించగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.విశాల్ -శేఖర్ ద్వయం రూపొందించిన సంగీతం టీ-సిరీస్ అందిస్తుంది.
           చిత్ర విశేషాలు చూస్తే  భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇతర ప్రాంతాలు విడిపోయే(1964) సమయంలో కథ మొదలు అయింది.ఇందులో సల్మాన్ కత్రినాకైఫ్ జోడి చాలా బాగుంది, సల్మాన్ దిశా పఠానీ కెమిస్ట్రీ బాగుంది.స్టార్ కమెడియన్ సునీల్ గ్రోవర్ పూర్తి స్థాయిలో సల్మాన్ పక్కన నటించారు మరియు జాకీ ష్రాఫ్ అద్భుతమైన కీలక పాత్ర పోషించారు.
                సల్మాన్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి రాబోతున్న భారీ చిత్రం.సుల్తాన్, టైగర్ జిందా హై చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ చిత్రాలన్న సంగతి విదితమే.
                 ఈ చిత్రంలో సల్మాన్ పలికే సంభాషణలు అద్యంతం రక్తి కట్టిస్తున్నాయి.ఈ చిత్రం జూన్ నెల 5 న రంజాన్ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...