9, నవంబర్ 2019, శనివారం

మాటలు రాక మూగబోయిన అగ్రహీరోయిన్...

ఒకప్పుడు చలన చిత్ర పరిశ్రమలో మూకీ చిత్రాలు ఉండేవి అంటే మాటలు లేకుండా కేవలం హావభావాలతో చిత్రాలు ఉండేవి.తర్వాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు వచ్చాయి ,తర్వాత ఈస్ట్మన్ కలర్,   నేడు త్రీడీ చిత్రాలు వస్తున్నాయి.వెండితెరపై ఎన్నో రకాల చిత్రాలను చూశాం. కామెడీ, హారర్, ప్రేమ ,రొమాన్స్ ఇలా అన్ని రకాలు చూశాం.

ఈమధ్య హారర్ చిత్రం లో కామెడీని జోడించి హారర్ కామెడీ చిత్రాలు కూడా చూశాం కానీ ఇప్పుడు వైవిధ్యంగా హారర్ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ జోడించి కొత్త చిత్రం రాబోతుంది ఆచిత్రం పేరే నిశ్శబ్దం. ఈ సరికొత్త చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ,తమిళం , మలయాళం తో పాటు హాలీవుడ్లో కూడా విడుదల కాబోతుంది. ఇంగ్లీషులో సైలెన్స్ అనే పేరుతో ఈ చిత్రం  అందరి ముందుకు రాబోతుంది.

ఒకప్పుడు మహానటి సావిత్రి గారి ని చూశాం ఆ తర్వాత విజయశాంతి గారిని ,సౌందర్య గారిని ,రమ్యకృష్ణ గారిని చాలా మంది నటీమణులను చూశాం  నేటి తరం నటీమణుల్లో అనుష్క గారు సరికొత్త రూపంలో  అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా మూగ సైగలతో తెరకెక్కిన ఈ చిత్రం నిశ్శబ్దం.అనుష్క గారు ఎంచుకునే కథలను బట్టి రోజురోజుకు ఆమె ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉంటుంది.

ఈ చిత్రంలో అనుష్క గారు మాటలు రాని  పాత్రలో నటించగా ఆమెకు సహాయ పాత్రలుగా మాధవన్, అంజలి ,సుబ్బరాజు,శ్రీనివాస్ అవసరాల, శాలిని పాండే నటించారు.ఈ చిత్రాన్ని కోన ఫ్యాక్టరీ, పీపుల్ ల్ మీడియా ప్రొడక్షన్స్ పై   కోన వెంకట్ నిర్మించగా హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు .గోపీసుందర్ చక్కటి స్వరాలందించారు.ఈ చిత్రం అతి త్వరలో అందరి ముందుకు రానుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

బ్రూస్లీ కొత్త చిత్రం మన ముందుకు రాబోతోంది

నమస్కారం మిత్రమా!సమాజంలో కొందరిని చూస్తుంటే బాధగా ఉంటుంది ,కొందర్ని చూస్తే ఈర్ష గా ఉంటుంది, కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది.నాకు ఒక్కసారి అ...